
చెన్నై: కోలీవుడ్ హీరో ఆర్య ఇంట్లో ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. అన్నానగర్ పాటు పలు ప్రాంతాల్లో ఆర్యకు చెందిన సీ షెల్ రెస్టారెంట్లపై కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలోనే అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
చెన్నైలోని సీ షెల్ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. అన్నానగర్ బ్రాంచ్లో మాత్రమే ఐదుగురికి పైగా ఐటీ అధికారులు రెండు వాహనాల్లో వచ్చి జూన్ 18న ఉదయం 8 గంటల నుంచి తనిఖీలు చేశారు. దీనిపై స్పందిస్తూ షెల్ రెస్టారెంట్లతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ హోటళ్ల నిర్వహణ బాధ్యతను ఆయన కొన్నేళ్ల క్రితమే మరో వ్యక్తికి అప్పగించినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు ఆర్య. తర్వాత రాజారాణి సినిమాతో తెలుగులో ఫేమస్ అయ్యాడు. ఆర్య తెలుగు, తమిళంలో దాదాపు 11 సినిమాలను నిర్మించారు.