హోంగార్డులను పర్మినెంట్ చేయాలి

హోంగార్డులను పర్మినెంట్ చేయాలి

ముషీరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని హోంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలని తెలంగాణ హోంగార్డ్స్ జేఏసీ డిమాండ్ చేసింది. సోమవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 

జేఏసీ చైర్మన్ సకినాల నారాయణ, నేషనల్ జనరల్ సెక్రెటరీ రాజశేఖర్ మాట్లాడుతూ..  రాష్ట్రంలో హోంగార్డ్స్ పరిస్థితిని తెలుసుకున్న సీఎం కేసీఆర్ తమను పర్మినెంట్ చేస్తామని అనేక సభల్లో,  అసెంబ్లీ సమావేశాల్లోనూ చెప్పారని గుర్తు చేశారు.  సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియమకాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, చంద్రశేఖర్, చైతన్య emతదితరులు పాల్గొన్నారు.