
- ఆ తర్వాత నేను ప్రయత్నిస్తా: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఈ మూడేండ్లు, రాబోయే ఐదేండ్లు రాష్ట్రానికి సీఎంగా రేవంత్ రెడ్డియే కొనసాగుతారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. అనంతరం సీఎం అయ్యేందుకు తాను ప్రయత్నిస్తానని తెలిపారు. గురువారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం అయ్యేందుకు తాను ప్రజల వద్ద దరఖాస్తు పెట్టుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా.. రైతు భరోసా కింద ఒకేసారి రూ.9 వేల కోట్లు వారి ఖాతాలో వేశామని వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అందరి ఫోన్లను ట్యాప్ చేసి సాధించింది ఏంటని ప్రశ్నించారు. దీంతో ఆ పార్టీ నేతలు కూడా జనంలో బలహీనులయ్యారని ఆరోపించారు. కేసీఆర్ నీచమైన, దుర్మార్గమైన పాలన చేశారని, భార్య, భర్తలు మాట్లాడుకునే మాటలను కూడా రికార్డు చేసి విన్నారని ఆరోపణలు చేశారు.