ఎర్రవెల్లి రచ్చబండ కార్యక్రమాన్నినేను బాయ్ కాట్ చేస్తున్న

ఎర్రవెల్లి రచ్చబండ కార్యక్రమాన్నినేను  బాయ్ కాట్ చేస్తున్న

తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపు ఎర్రవెల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించిన రచ్చబండ కార్యక్రమాన్ని తాను బాయ్ కట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకకై ఎమ్మెల్యే అయిన తనకు రచ్చబండ కార్యక్రమం గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు.తనతోటి చర్చించలేదని..ఇది బాధాకరమన్నారు.జిల్లాలో రేవంత్ రెడ్డి  ఏదైన కార్యక్రమం తీసుకుంటే తమతో చర్చించి నిర్ణయం తీసుకున్నారని అందరు అనుకుంటారు కానీ తమతో చర్చించకుండానే నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటే పార్టీకి నష్టం జరుగుతుంది...కాబట్టే తాను మీడియా ముందు ఇప్పుడు  ప్రకటన చేయాల్సి వస్తుందన్నారు.

పీసీసీ అంటే అందరిని కలుపుకొని పోయే పోస్ట్.అందరిని విడదీసే పోస్ట్ కాదన్నారు. అంతర్గత విషయాలు మీడియా ముందు చెప్పడానికి చాలా బాధగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పీసీసీ వర్కింగ్ కమిటీ ఐన పీఏసీ మీటింగ్ లో చర్చించకుండానే రేవంత్ ప్రకటన చేస్తున్నాడన్నారు. తాను నిలదీస్తే బయట మాట్లాడితే అందరేమో బాధపడుతున్నారు.. లోపల అంతర్గతంగా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయన్నారు. అందరిని కలుపుకొని పోవాల్సిన రేవంత్ రెడ్డి ..అందరిని విడదీసి కార్యక్రమాలు ప్రకటిస్తున్నాడన్నారు. ఇలాంటి నిర్ణయాలను తాను తీవ్రంగా ఖండిస్తూ రేపు అధిష్టానానికి లేఖ రాస్తానన్నారు.