సెక్యూరిటీ ఫోర్సెస్‌పై మిలిటెంట్స్ అటాక్.. ఓ జవాన్‌కు గాయాలు

సెక్యూరిటీ ఫోర్సెస్‌పై మిలిటెంట్స్ అటాక్.. ఓ జవాన్‌కు గాయాలు

శ్రీనగర్: నార్త్‌ కశ్మీర్‌‌లోని బారాముల్లా జిల్లాలో సెక్యూరిటీ ఫోర్సెస్‌పై మిలిటెంట్స్‌ అటాక్‌ చేశారు. సోపోర్‌‌లోని హైజమ్ ఏరియాలో ఈ దాడి జరిగింది. సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌‌పీఎఫ్​)తోపాటు జమ్మూ కాశ్మీర్‌‌ పోలీసులపై పలు రౌండ్ల పాటు మిలిటెంట్స్‌ కాల్పులకు దిగారని సమాచారం. సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రతిఘటించారని తెలిసింది. అయినప్పటికీ ఘటన జరిగిన ప్రాంతం నుంచి మిలిటెంట్స్ ఎస్కేప్ అయ్యారని సమాచారం. ‘ఓ ఆర్మీ జవాన్‌కు గాయాలయ్యాయి. అతడికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నాం’ అని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. సదరు ఏరియాలో కార్డన్ మొదలుపెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్.. సెర్చ్ ఆపరేషన్స్‌ కూడా ప్రారంభించింది.