జాన్వికపూర్ ఫొటోలు మార్ఫింగ్.. కంప్లయింట్ చేసిన బ్యూటీ

జాన్వికపూర్ ఫొటోలు మార్ఫింగ్.. కంప్లయింట్ చేసిన బ్యూటీ

ప్రెజెంట్ జెనరేషన్ లో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిపోయింది. దానివల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియా వల్ల తన లైఫ్ లో ఎదురైనా చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor).    

ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఆమె.. సోషల్ మీడియా ప్రభావం తనపై ఎలాంటి ప్రభావం చూపించిందో వివరించింది. నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబంనుండి వచ్చాను కాబట్టి స్కూల్ దశ నుండే నా చుట్టూ ఫొటో గ్రాఫర్లు ఉండేవారు. ఎక్కడికైనా వెళ్లాలంటే భయమేసేది. పర్మిషన్ లేకుండా వెంటపడి ఫొటోలు తీసేవారు. ఒకసారి మా స్కూల్ ముందు కెమెరాలు పట్టుకుని వెయిట్ చేస్తున్న వారిపై నేను సీరియస్ అయ్యాను. అందుకు ప్రతీకారంగా నా ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశారు. దానివల్ల చాలామంది పిల్లలు కొంతకాలం నాతో డిస్టెన్స్ మెయింటెన్ చేశారు. నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళిగా మాట్లాడేవారు. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను.. అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ.

ఇక జాన్వీ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.