
- నడికుడి నుంచి మరో ఇంజన్ తెప్పించిన రైల్వే అధికారులు
- గంట సేపటి తరువాత విశాఖకు బయలుదేరిన ట్రైన్
నల్గొండ అర్బన్, వెలుగు: లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ సాంకేతిక లోపంతో నల్గొండ రైల్వే స్టేషన్ లో నిలిచిపోయింది. ఇంజన్ లో సమస్య రావడంతో రైల్వే అధికారులు నల్గొండలో ట్రైన్ను నిలిపివేసి పరిశీలించారు. సాంకేతిక లోపం ఉందని గుర్తించి నడికుడి జంక్షన్ నుంచి మరో రైల్ ఇంజన్ ను తెప్పించారు. గంట సేపటి తరువాత నల్గొండ నుంచి జన్మభూమి ఎక్స్ ప్రెస్ విశాఖకు బయలుదేరింది.
ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. స్టేషన్ వెలుపల ఈ ఘటన జరిగి ఉంటే మరో రైలు ఢీకొనే ప్రమాదం ఉండేదని, అదృష్టవషత్తు స్టేషన్లో సమస్య తలెత్తడంతో ప్రమాదం తప్పినట్లైంది. సాంకేతిక లోపాన్ని సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనై రైల్వే శాఖ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.