టీమిండియా బౌలర్ జస్ర్పిత్ బుమ్రా, బ్యాట్స్ వుమెన్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ఈ యంగ్ ప్లేయర్లు ప్రతిష్టాత్మక విజ్డెన్ ఇండియా అల్మానక్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులకు సెలక్ట్ అయ్యారు. మొత్తం ఐదుగురికి ఈ పురస్కారం లభించగా.. అందులో ఇద్దరు ఇండియన్స్ ఉండడం విశేషం. మిగతవారిలో ఫఖర్ జమాన్ (పాకిస్తాన్), దిముత్ కరుణరత్నే (శ్రీలంక), రషీద్ ఖాన్(అప్ఘనిస్తాన్) లకు పురస్కారం వరించింది.
విజ్డెన్ అవార్డుకి సెలక్ట్ అయిన మూడో భారత మహిళా క్రికెటర్ గా స్మృతి మంధాన నిలిచింది. అంతకుముందు మాజీ కెప్టెన్ మిథాలిరాజ్, దీప్తి శర్మ ఈ ఘనతను సాధించారు. అలాగే దిగ్గజ ఆటగాళ్లైన గుండప్ప విశ్వనాథ్, లాలా అమర్ నాథ్ లు విజ్డెన్ ఇండియా హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించారు.
మయాంక్ పై కథనాలు
సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో డబుల్ సెంచరీ సాధించిన మాయంక్ అగర్వాల్కు కూడా అరుదైన గౌరవం దక్కింది. 2019-2020కి గానూ 7వ విజ్డెన్ వార్షిక పబ్లికేషన్ లో మయాంక్ కథనాలు ప్రచురితమయ్యాయి.