కాంగ్రెస్ తో కలవం..సింగిల్ గానే వెళ్తాం: దేవేగౌడ

కాంగ్రెస్ తో కలవం..సింగిల్ గానే వెళ్తాం: దేవేగౌడ

కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ పొత్తుకు గుడ్ బై చెప్పారు జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవేగౌడ. అక్టోబర్ 21 న జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఒంటరిగానే పోటీచేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల తన కొడుకు కుమార స్వామి బాగా నష్టపోయారని అన్నారు.  కాంగ్రెస్ తో జతకట్టి మళ్లీ అదే తప్పుచేయబోమన్నారు. కర్ణాటకలో గత సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు  వేయడంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.