నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి : వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు

నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి : వర్సిటీ రిజిస్ట్రార్  వెంకటేశ్వరరావు
  • ఇంజినీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: జేఎన్‌‌‌‌టీయూ అనుబంధ కాలేజీలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ఆ వర్సిటీ రిజిస్ట్రార్  వెంకటేశ్వరరావు ఆదేశించారు. జేబీఐఈటీ కాలేజీలో అదనపు ఫీజుల వసూళ్లపై రాకేశ్, హనుమంత్ నాయక్  జాతీయ ఎస్టీ కమిషన్​కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 6న కమిషన్  సభ్యులు జాటోత్ హుస్సేన్ అధ్యక్షతన ఢిల్లీలో జేఎన్టీయూ రిజిస్ట్రార్​తో పాటు జేబీఐఈటీ ప్రిన్సిపల్ సమావేశం జరిగింది. 

జేఎన్‌‌‌‌టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు తమ అనుబంధ ఇంజినీరింగ్  కాలేజీల్లో నిబంధనల ప్రకారం ఫీజు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధన లు ఉల్లంఘిస్తే కాలేజీలను బ్లాక్ లిస్టులో పెడ్తామని జేఎన్టీయూ హెచ్చరించింది.