
- ఇంజినీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: జేఎన్టీయూ అనుబంధ కాలేజీలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ఆ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఆదేశించారు. జేబీఐఈటీ కాలేజీలో అదనపు ఫీజుల వసూళ్లపై రాకేశ్, హనుమంత్ నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 6న కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ అధ్యక్షతన ఢిల్లీలో జేఎన్టీయూ రిజిస్ట్రార్తో పాటు జేబీఐఈటీ ప్రిన్సిపల్ సమావేశం జరిగింది.
జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు తమ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో నిబంధనల ప్రకారం ఫీజు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధన లు ఉల్లంఘిస్తే కాలేజీలను బ్లాక్ లిస్టులో పెడ్తామని జేఎన్టీయూ హెచ్చరించింది.