కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ వీసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో వీసీ ఛాంబర్ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఇదేమని అడిగితే అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని నిరసన తెలిపారు.
దళిత, గిరిజన విద్యార్థులను కించపరుస్తున్నాడని ఫోరం నాయకులు జవ్వాజి దిలీప్, రాహుల్నాయక్ తెలిపారు. వీసీ తన వైఖరిని మార్చుకోవాలని, లేదంటే ప్రభుత్వం వెంటనే స్పందించి వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాగర్నాయక్, దుర్గాప్రసాద్, సుజయ్, శ్రీనికేతన్, ఆనంద్, ఆదిత్య, చక్రవర్తి, శ్రీకాంత్, వసంత్ పాల్గొన్నారు.
