- 20 మంది సీనియర్ లీడర్లు రిజైన్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలింది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్కు చాలా దగ్గరివారైన నలుగురు మాజీ మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా 20 మంది సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీకి, కాశ్మీర్ ఇన్చార్జి సెక్రెటరీకి రాజీనామా లేఖలు పంపినట్లు బుధవారం తెలిపారు. వీళ్లంతా రాష్ట్రంలో పార్టీ నాయకత్వాన్ని మార్చాలని కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. మీర్ అధ్యక్షతన రాష్ట్రంలో కాంగ్రెస్ను నాశనం పట్టిస్తున్నారని రాజీనామాలో ఆరోపించారు. తమ సమస్యలు వినిపించేందుకు హైకమాండ్ సమయం ఇవ్వలేదని నేతలు పేర్కొన్నారు.