
టీ20 వరల్డ్ కప్ 2022 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు...ప్రస్తుతం చర్చనీయాంశమైంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ దశకు చేరుకున్న స్థితిలో..ప్రస్తుతం ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు ఎవరికి లభిస్తుందన్న ఆసక్తి నెలకొంది. అయితే ఈ అవార్డు కోసం 9 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. భారత జట్టు నుంచి కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లాండ్ నుంచి బట్లర్, హేల్స్, సామ్ కర్రన్తో పాటు..పాక్, జింబాబ్వే, శ్రీలంక జట్ల నుంచి మరో నలుగురు రేసులో ఉన్నారు. ఇదిలా ఉంటే..ప్లేయర్ ఆఫ్ ది టోర్నీపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
అతనికే ఇస్తా..
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డుకు టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవే అర్హుడని ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ అంటున్నాడు. తానైతే సూర్యకుమార్ యాదవ్కే ఇస్తానని చెప్పాడు. వరల్డ్ కప్లో అతను అద్భుతంగా ఆడాడని..టీమిండియా సెమీస్ చేరడంలో సూర్య కీలక పాత్ర పోషించాడని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా జింబాబ్వేపై సూర్య ఆడిన ఇన్నింగ్స్ హైలెట్ అన్నాడు.
ప్రేమా...? ఎటకారమా..?
సూర్యకుమార్కుప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఇవాలని బట్లర్ అనడంపై సోషల్ మీడియా మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇంగ్లండ్తో సెమీస్లో సూర్య విఫలమయ్యాడని..అందుకే అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఇవ్వాలని బట్లర్ ఎటకారంగా అంటున్నాడని టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి పసికూనలపై సూర్య రెచ్చిపోయాడని...సౌతాఫ్రికాపై ఆడినా జట్టు ఓడిపోయిందంటున్నారు. అయితే కీలక పాకిస్తాన్, ఇంగ్లండ్ లపై సూర్య విఫలమైనందుకే అతన్ని ఎగతాళి చేస్తూ..బట్లర్ ఈ వ్యాఖ్యలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.