జూన్ వరకు నడ్డానే బీజేపీ చీఫ్ పదవీకాలం పొడిగింపు

జూన్ వరకు నడ్డానే బీజేపీ చీఫ్ పదవీకాలం పొడిగింపు

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించింది. ఈ ఏడాది జూన్ వరకు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ మేరకు పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. నడ్డా పదవీకాలాన్ని పొడిగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించగా, దానికి నేషనల్ కౌన్సిల్ తాజాగా ఆమోదం తెలిపింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కూడా నడ్డాకు అప్పగించింది. కాగా, 2019లో అమిత్ షా కేంద్రమంత్రి కావడంతో పార్టీ పగ్గాలను నడ్డా చేపట్టారు.