డిసెంబర్ 24న తెలంగాణకు నడ్డా

డిసెంబర్ 24న తెలంగాణకు నడ్డా

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఈ నెల 24న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. ఆ తరువాత ఈ నెల 26 లేదా 28 తేదీల్లో  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర బీజేపీ లీడర్లు చెబుతున్నారు. 

రాష్ట్రంలోని పార్టీ నేతలకు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై దిశా నిర్దేశం చేసేందుకే  జేపీ నడ్డా వస్తున్నారని చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై కూడా ఈ ఇద్దరు అగ్ర నేతలు రాష్ట్ర నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.