టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర(Devara). యువసుధ క్రియేషన్స్(Yuvasuda creations) అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్(Ntr arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శివ కొరటాల(shiva koratala) తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్(Saif ali khan) విలన్ గా నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా ఏ న్యూస్ వినిపించిన క్షణాల్లో వైరల్ అవుతోంది.
Completed a mammoth mid sea night action .Under water n Surface level filming with @tarak9999 bro ?director #koratala siva @anirudhofficial #king Solomon @sabucyril @Yugandhart_ @NTRArtsOfficial @YuvasudhaArts and my team #Devara ?@ARRIChannel #Nauticam pic.twitter.com/Bzl6Boj5Tu
— Rathnavelu ISC (@RathnaveluDop) October 1, 2023
తాజాగా ఈ సినిమా నుండి మరో న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఆ క్రేజీ న్యూస్ రివీల్ చేసింది మరెవరో కాదు దేవర సినిమాకు కెమెరామెన్ గా చేస్తున్న రత్నవేలు. తాజాగా ఆయన తన ట్విట్టర్ లో దేవర సినిమా అప్డేట్ పోస్ట్ పెట్టారు. అందులో ఆయన.. మముత్ మిడ్-సీ నైట్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేశాము. సోదరుడు తారక్ తో నీటి అడుగున, నీటిపైన షూట్ జరిగింది. ఎన్టీఆర్తో నైట్ ఎఫెక్ట్లో, తక్కువ లైట్లో, నీళ్లల్లో అదిరిపోయే యాక్షన్ సీన్స్ షూట్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది.. అంటూ ట్వీట్ చేశాడు రత్నవేలు. దీంతోపాటు షూటింగ్ స్పాట్ కు సంబందించిన ఓ ఫొటోను కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక దేవర సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.