జూబ్లీహిల్స్ బాధితురాలి పరిస్థితి విషమం

జూబ్లీహిల్స్ బాధితురాలి పరిస్థితి విషమం

జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో  తీవ్రంగా గాయపడ్డ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఐదు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో రెండున్నర నెలల బాలుడు మృతి చెందగా...బాలుడి తల్లి కాజల్ పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలు కాజల్ చౌహాన్ను మహారాష్ట్రకు తరలించారు. అహ్మద్ నగర్ జిల్లా కేంద్రం లోని ప్రైవేట్ హాస్పిటల్లో కాజల్ చౌహాన్కు చికిత్స అందిస్తున్నారు. 

ఈ నెల 17న రాత్రి జూబ్లీహిల్స్ లో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే షకీల్ బంధువులకు చెందిన కారు అదుపు తప్పి రోడ్డుపై బుడగలు విక్రయిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారిక చౌహాన్ గాయపడ్డారు. కాజల్ చేతిలో ఉన్న చిన్నారి రణవీర్ కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే చిన్నారి రణవీర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. ప్రమాదం సమయంలో కారు డ్రైవ్ చేసింది ఎమ్మెల్యే కొడుకేనంటూ వచ్చిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. బాధితురాలు కాజల్ చౌహన్ ను నిందితులు బలవంతంగా మహారాష్ట్రకు తరలించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కాజల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తల కోసం...

రేపు పంజాబ్ వ్యాప్తంగా హాలిడే

సామాన్యులకు షాక్.. పెరిగిన వంట గ్యాస్ ధర

లవ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌తో ఐశ్వర్య బాలీవుడ్ ఎంట్రీ