
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఏఐజీలో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
ఆయనకు అనారోగ్యం అని తెలిసిన వెంటనే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర నేతలు హుటాహుటిన ఏఐజీ హాస్పిటల్కు వెళ్లారు. కొన్ని నెలలుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్య కూడా ఆయన అనారోగ్యానికి కారణమైంది.
ఏఐజీ ఆసుపత్రిలో గతంలో చికిత్స తీసుకున్న ఆయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.