హైకోర్టు జడ్జి జస్టిస్‌‌ రాధారాణికి వీడ్కోలు

హైకోర్టు జడ్జి జస్టిస్‌‌ రాధారాణికి వీడ్కోలు

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ జి.రాధారాణి పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఫస్ట్‌‌ కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు సమావేశం జరిగింది. యాక్టింగ్‌‌ చీఫ్‌‌ జస్టిస్‌‌ సుజోయ్‌‌ పాల్‌‌ అధ్యక్షతన జడ్జీలు సమావేశం అయ్యారు. ఆమె సేవల్ని ఏసీజే కొనియాడారు. అడ్వకేట్ జనరల్‌‌ సుదర్శన్‌‌రెడ్డి మాట్లాడారు. 675 రోజుల్లో 5,375 మెయిన్‌‌ కేసులు, 6,818 మిస్లీనియస్‌‌ కేసులు పరిష్కారించారని చెప్పారు. జస్టిస్ సుధారాణి మాట్లాడారు. చట్టం అంటే.. సమాజానికి ఆత్మలాంటిందన్నారు. 

వీడ్కోలు సమావేశంలో అడిషనల్‌‌ సొలిసిటర్‌‌ జనరల్‌‌ నర్సింహ శర్మ, పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్‌‌ పల్లె నాగేశ్వర్‌‌ రావు, బార్‌‌ కౌన్సిల్‌‌ చైర్మన్‌‌ నరసింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్‌‌ జనరల్‌‌ గాడి ప్రవీణ్‌‌కుమార్, ఏఏజీలు ఇమ్రాన్‌‌ఖాన్, తేరా రజనీకాంత్‌‌ రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏఏ) అధ్యక్షుడు జగన్, జస్టిస్‌‌ రాధారాణి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

అనంతరం హెచ్‌‌సీఏఏ ఆధ్వర్యంలో ఆమెకు వీడ్కోలు సమావేశం జరిగింది. కాగా, ఏపీలోని తెనాలికి చెందిన రాధారాణి.. అడ్వకేట్​గా ఎన్‌‌రోల్‌‌ అయ్యాక కొంతకాలం ప్రాక్టీస్‌‌ చేశారు. తర్వాత డిస్ట్రిక్ట్, సెషన్స్‌‌ జడ్జిగా ఎంపికయ్యారు. ఏపీ, తెలంగాణలో పనిచేశారు. నల్గొండ ప్రిన్సిపల్‌‌ జిల్లా జడ్జిగా, హైదరాబాద్‌‌ మెట్రోపాలిటన్‌‌ సెషన్స్‌‌ జడ్జిగా, హైదరాబాద్‌‌లోని వ్యాట్‌‌ అప్పిలేట్‌‌ ట్రిబ్యునల్‌‌ చైర్‌‌పర్సన్‌‌గా, రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్‌‌ జిల్లా జడ్జిగా పనిచేశారు. 2021, అక్టోబర్‌‌ 16న హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.