తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నవీన్ రావు

తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నవీన్ రావు

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు ఒక్కరోజు సీజేగా జస్టిస్ నవీన్ రావు బాధ్యతలు చేపట్టారు. ఒక్కరోజు హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నట్లు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులు కావడంతో నవీన్ రావును ఆ స్థానంలో నియమాకం చేశారు. శుక్రవారం (జులై 14న) సాయంత్రం జస్టిస్ నవీన్ రావు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీజే వచ్చేవరకు జస్టిస్ షావిలి తాత్కాలిక సీజేగా కొనసాగనున్నారు.