సీఎం అయినంక రూ. 5లక్షల కోట్ల అప్పు తీరుస్త : కేఏ పాల్

సీఎం అయినంక రూ. 5లక్షల కోట్ల అప్పు తీరుస్త : కేఏ పాల్

తెలంగాణలో  కేసీఆర్ రూ. 5లక్షల కోట్ల అప్పులు చేశారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. వాటన్నింటిని తీర్చగలిగే పార్టీ ప్రజా శాంతి పార్టీ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీని గెలిపిస్తే రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తానన్నారు. అవినీతి పరులు కావాలో....అప్పులు తీర్చి..అభివృద్ధి చేసే ప్రజా శాంతి పార్టీ కావాలో  తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. 

రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని కేఏ పాల్ మండిపడ్డారు.  పింఛన్లు అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతు రుణమాఫీ, దళిత బంధు, దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్ రూమ్ పథకం, నిరుద్యోగ భృతి వంటి అనేక హామీలిచ్చిన కేసీఆర్..గెలిచాక వాటన్నింటిని గాలికొదిలేశారని మండిపడ్డారు.