
కావేరీ జలాల విషయంలో కొన్నేళ్లుగా కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళనాడు వాటా నీళ్లను విడుదల చేసిన నేపథ్యంలో.. కర్ణాటకలో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ అంశంపై సినీ, రాజకీయ ప్రముఖులు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కావేరీ జలాల విషయంలో న్యాయం కోరుతూ.. ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాశారు ప్రముఖ కన్నడ నటుడు ప్రేమ్ నెనపిరావి. ఆ లేఖలో… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి.. కర్ణాటకకు, కావేరీకి న్యాయం చేయండి. కావేరీ మాది’’ అని రాశారు. రక్తంతో రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లేఖను చూసిన నెటిజన్స్ స్పందిస్తూ.. కేంద్రం జోక్యం చేసుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
- ALSO READ | వందలాది మందిని కాపాడిన 12ఏళ్ల బాలుడు.. ఎలాగంటే..