
పాకిస్థాన్కు చెందిన సీమా హైదర్(Seema Haider), ఉత్తర్ ప్రదేశ్ యువకుడు సచిన్ మీనా(Sachin Meena) (25) పబ్జీ(pubg) ప్రేమకథ గురుంచి అందరికీ తెలిసిందే. ప్రియుడి కోసం ఎన్నో కష్టాలు పడి, సరిహద్దులు దాటి నేపాల్ చేరిన సీమా హైదర్.. చివరకు సచిన్ ను కలిసింది. ఆపై వీరిద్దరూ వివాహబంధంలోకి కూడా అడుగుటపెట్టారు.
లేటెస్ట్ గా వీరి గురించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. వీరి పరిచయం, ప్రేమ, పెళ్లి విషయాలు ఎంతో ఇంట్రెస్టింగ్ ఉండటంతో.. వీరి జర్నీ మీద మూవీ రాబోతుందని తెలుస్తోంది. ఓ ఎపిసోడ్లో భాగంగా ఫిల్మ్ ప్రొడ్యూసర్ అమిత్ జానీ మాట్లాడుతూ.. సీమా హైదర్, సచిన్లపై మూవీ తీయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. ఈ చిత్రానికి కరాచీ టు నోయిడా అనే టైటిల్ను కూడా పెట్టేశానని వెల్లడించారు.
దీంతో సీమా హైదర్.. సచిన్ల సరిహద్దుల ప్రేమ కథను చూడటానికి ప్రేక్షకులు ఎంతో వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరూ ఆన్లైన్ గేమ్ పబ్జీ ద్వారా ఎలా కలుసుకున్నారు? ఎలా ప్రేమలో పడ్డారు? అన్నది ఎలా తెరెకెక్కిస్తారన్నది ఆసక్తిగా మారింది. వీరి ప్రేమకథ ఆధారంగా తీయనున్న 'కరాచీ టు నోయిడా' మూవీ జానీ ఫైర్ఫాక్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ సమర్పణలో మూవీ రాబోతుందని సమాచారం. అలాగే టైటిల్ ట్రాక్ వచ్చే వారం విడుదల కానుందని ప్రొడ్యూసర్ అమిత్ జానీ పేర్కొన్నారు.
ఈ మూవీ ప్రొడ్యూసర్ అమిత్ జానీ ఉదయ్పూర్లో జరిగిన కన్హయ్య హత్య కేసుపై తన చిత్రాలను ఎ టైలర్ మర్డర్ అనే పేరుతో తెరకెక్కించారు. అంజు జీవితంపై మేరా అబ్దుల్ ఐసా నహీ హై అనే చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నారు. ఇవి కాకుండా, జానీ పాల్ఘర్లో సాధువుల హత్య ఆధారంగా వెబ్ సిరీస్ మోబ్లించింగ్లో కూడా పని చేస్తున్నారు.