T20 ట్రోఫీలను ఆవిష్కరించనున్న కరీనా

T20 ట్రోఫీలను ఆవిష్కరించనున్న కరీనా

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం లభించింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న పురుషుల, మహిళల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలను మెల్‌బోర్న్‌లో ఆమె ఆవిష్కరించనున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15వరకు జరగనున్న ICC టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోంది. పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు ముందే మహిళల టీ20 టోర్నీ జరగనుంది. మహిళల టోర్నీ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వరకు జరగనుంది.

ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగస్వామ్యం కావడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపింది కరీనా కపూర్‌. వారి కలలను సాకారం చేసుకునేందుకు ఆయా దేశాల తరుపున ఆడుతున్న మహిళలందరినీ ఎంకరేజ్ చేయానుకుంటున్నాని తెలిపింది. ట్రోఫీని ఆవిష్కరించడం చాలా గౌరవంగా ఉందని చెప్పింది కరీనా.