ఫెమినా మిస్ ఇండియాగా కర్ణాటక యువతి

ఫెమినా మిస్ ఇండియాగా కర్ణాటక యువతి

ఫెమినా మిస్ ఇండియా 2022 కిరీటాన్ని దక్కించుకుంది కర్ణాటకకు చెందిన సినిశెట్టి. 58వ ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీని ముంబైలో నిర్వహించారు. ఫైనాల్స్ లో మిస్ ఇండియా 2022 విజేతగా సినిశెట్టిని ప్రకటించారు నిర్వాహకులు. అలాగే రాజస్థాన్ కు చెందిన రూబల్ షెకావత్ రెండో రన్నరప్ గా నిలిచారు. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి చేతుల మీదుగా సినీ శెట్టి కిరీటాన్ని అందుకున్నారు. సినీ శెట్టి కర్ణాటకలో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం CFA అనే కోర్సు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ వరల్డ్ పోటీలో పాల్గోనున్నారు సినిశెట్టి.