వందకోట్ల వసూళ్ల సంబరంలో కార్తికేయ-2 చిత్ర బృందం

వందకోట్ల వసూళ్ల సంబరంలో కార్తికేయ-2 చిత్ర బృందం

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శక‌త్వంలో కార్తికేయకి మూవీ సీక్వెల్ గా వచ్చిన  కార్తికేయ‌ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ముందుగా పరిమిత థియేటర్స్ లో మాత్రమే విడుదలైన కార్తికేయ 2 చిత్రం.. కేవలం మౌత్ టాక్ తో చాలా థియేటర్స్ లో నడుస్తోంది. ప్రతిచోటా హౌస్ ఫుల్స్ తో రన్ అవుతూ నిర్మాతకు మంచి లాభాలను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోవడంతో చిత్ర యూనిట్ సెలెబ్రేషన్స్ చేసుకుంది.

కార్తికేయ‌ 2 మూవీకి ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు, నిఖిల్, అనుపమ, డిస్టిబ్యూటర్స్ కు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రేమమ్, శతమానం భవతి సినిమాల తరువాత ఈ సినిమా తన లైఫ్ లో గొప్ప మూవీగా నిలిచిపోయిందని నటి అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ తనకు చాలా విలువైందన్న అనుపమ..  మూవీ టీమ్ కు కంగ్రాట్స్ చెప్పారు. 

ఇలాంటి కథ సినిమా తీయడానికి తనకు విజ్ఞానాన్ని, వికాసాన్ని నేర్పించిన తన తల్లిదండ్రులకు, తమ అన్నయ్యకు దర్శకుడు చందు మొండేటి ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు నిఖిల్ గురించి బాలీవుడ్ లో కూడా మాట్లాడటం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారని హీరో నిఖిల్ చెప్పారు. రాజమౌళి, సుకుమార్ సలహాలు, సూచనలతోనే కార్తికేయ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశామన్నారు. 1200 స్క్రీన్ లలో కార్తికేయ 2 సినిమా ఆడుతుందంటే.. అదంతా తెలుగు సినిమా గొప్పతనమని అన్నారు. తనను ఒక ఫ్రెండ్ లా, ఫ్యామిలీ మెంబెర్ లా ఫీలై ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.