హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీనికి సబంధించి పార్టీ అధిష్ఠానానికి తన రాజీనామా పత్రాన్ని పంపారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన క్రమంలో హుజురాబాద్ టికెట్ తనకే వస్తుందని ఓ కార్యకర్తతో ఫోన్లో మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించింది.
దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ..TRS నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. షోకాజ్ నోటీసు అందుకున్న 24 గంటల్లోనే కౌశిక్ రెడ్డి రాజీనామా ప్రకటించారు.