హైదరాబాద్, వెలుగు: ప్రశ్నిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కవిత అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడిందని పేర్కొన్నారు. మంగళవారం ఈ ప్రాజెక్టు పనుల విషయమై సీఎం రేవంత్ రివ్యూపై ఆమె ‘ఎక్స్’లో స్పందించారు. తమ ఒత్తిడితోనే త్వరితగతిన భూసేకరణ చేపట్టి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను మొదలు పెట్టాలని, పెండింగ్లో ఉన్న 19, 20, 21 ప్యాకేజీల పనులు ప్రారంభించే వరకు రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పారు.
