మళ్లీ ఎమ్మెల్సీగా కవిత..రేపు నామినేషన్

మళ్లీ ఎమ్మెల్సీగా కవిత..రేపు నామినేషన్

ఉత్కంఠకు తెరపడింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కవిత పేరు ఖరారు అయ్యింది. రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు కవిత. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు నిజామాబాద్ ఎమ్మెల్సీ  దాదాపు ఖరారయిందనే అందరూ అనుకుకన్నారు. కానీ హఠాత్తుగా తెరపైకి కవిత పేరును ప్రకటించారు. తన రాజకీయ భవిష్యత్తుపై గంపెడాశలు పెట్టుకున్న ఆకుల లలితకు నిరాశే ఎదురయ్యింది.