నిజాం కాలేజీ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం

నిజాం కాలేజీ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం

యువత జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ క్రియేటర్స్గా ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోందనీ... ఇక్కడ అనేక ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ నిజాం కాలేజీ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్..మన ఉరు..మన బడిలో భాగంగా కళాశాల అభివృద్దికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు మన దేశానికి చెందిన వాళ్ళు CEOలుగా ఉండటం గర్వించదగ్గ విషయమే అయినా... అంత గొప్ప కంపెనీలు మాత్రం మన దేశం నుంచి లేవనిచెప్పారు. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న కేటీఆర్.. తాను ఇదే కాలేజీలో బిఎస్సీ మైక్రో బయాలజీ చదివిన విషయాన్ని గుర్తు చేశారు. నిజాం కాలేజీ పూర్వ విద్యార్థిగా కాలేజీకి అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.