తిరువనంతపురం: ఓ ఐఏఎస్ అధికారి తప్ప తాగి కారు నడిపి జర్నలిస్ట్ ప్రాణం తీశారు. కేరళ క్యాడర్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ శ్రీరామ్ వెంకటరామన్ శనివారం తెల్లవారుజామున కారుతో బీభత్సం సృష్టించారు. తాగి కారు నడిపి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టి, గోడకు వెళ్లి గుద్దుకున్నారు. ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న మలయాళ న్యూస్పేపర్ ‘సిరాజ్’ బ్యూర్ చీఫ్ బషీర్ (35) స్పాట్లో చనిపోయారు. తిరువనంతపురంలోని మ్యూజియం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కారు బలంగా ఢీకొట్టడంతో బైకు ఎగిరి దాదాపు 100 మీటర్ల దూరంలో పడిందని, వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 2012 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన వెంకటరమణ ఆ బ్యాచ్లో సెకండ్ టాపర్. అమెరికా హార్వర్డ్లో సంవత్సరం పాటు ఉన్నత చదువులు పూర్తి చేసుకుని వచ్చిన అతనిని ఈ నెల 1న డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో నియమించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో వెంకటరమణ, స్నేహితురాలు వాఫా అఫ్జా ఉన్నారు. వారికి గాయాలు కావటంతో హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తిరువనంతపురం పోలీస్ కమిషనర్ చెప్పారు.