ఈ నెల 31 వరకు కేరళలో 144 సెక్షన్

ఈ నెల 31 వరకు కేరళలో 144 సెక్షన్

కేరళలో కరోనా వైరస్ మహమ్మారి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కచోట ఐదుగురు మించి గుమిగూడటాన్ని నిషేధిస్తూ సీఆర్‌పీసీ సెక్షన్ 144ను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఎక్కువ మంది గుమిగూడటం వల్ల కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఆదేశాలు అక్టోబరు 3 శనివారం ఉదయం 9 గంటల నుంచి అమల్లోకి వస్తాయని.. ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.