కేరళలో కరోనా రూల్స్‌.. మరో సంవత్సరం కంటిన్యూ

కేరళలో కరోనా రూల్స్‌.. మరో సంవత్సరం కంటిన్యూ
  • కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తిరువనంతపురం: కరోనాని కట్టడి చేసేందుకు కేరళలో విధించిన రూల్స్‌ మరో సంవత్సరం పాటు కొనసాగనున్నాయి. మాస్కులు వాడటం, సోషల్‌ డిస్టెంసింగ్‌ సంవత్సరం పాటు కచ్చితంగా పాటించాలని కేరళ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పెళ్లిలు, ఫంక్షన్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పింది. సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు లాంటి వాటిపై సంవత్సరం పాటు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. షాపులు, మాల్స్‌లో ఒక్కసారి కేవలం 20 మందిని మాత్రమే అనుమతించాలని, షాపు సైజును బట్టి సంఖ్యను తగ్గించాలని అన్నారు. రోడ్లపై, పబ్లిక్‌ ప్లేసుల్లో ఊయడం బ్యాన్‌ చేసింది. అంతరాష్ట్ర ప్రయాణాలకు పాస్‌లు అవసరం లేదని, కానీ జగ్రతా ఈ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం రిజిస్టర్‌‌ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. మన దేశంలో మొదటి కరోనా కేసు నమోదైంది కేరళలోనే. ఈ ఏడాది జనవరిలో మొదటి కేసు నమోదు కాగా.. ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేసుల సంఖ్య చాలా వరకు తక్కువగా ఉంది.