కేరళలో టెస్ట్ చేసిన ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా

కేరళలో టెస్ట్ చేసిన ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా

కేరళలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో నిత్యం 50వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. టెస్టులు నిర్వహించిన ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్గా తేలుతోంది. గడిచిన 24 గంటల్లో 1,03,366 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 51,570 మందికి కరోనా నిర్థారణ అయింది. ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 9,704 కేసులు నమోదుకాగా.. త్రిస్సూర్ లో7,289, తిరువనంతపురంలో 5,746 మంది చొప్పున కొవిడ్ బారినపడ్డారు. కేరళలో గడిచిన 24 గంటల్లో 32,701 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 14 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 3,54,595 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ ప్రకటించింది.

మరిన్ని వార్తల కోసం..

డబ్ల్యూహెచ్‌వోపై ప్రధాని మోడీకి తృణమూల్ ఎంపీ ఫిర్యాదు

రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి