గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు

గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు

హైదరాబాద్: గ్రూప్‌1 మెయిన్స్‌ ఫలితాలను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. గతంలో ప్రకటించిన జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ రద్దు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 మెయిన్స్‌ పేపర్లను రీవాల్యుయేషన్‌ చేయాలని ఆదేశించింది. రీవాల్యుయేషన్‌ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీకి హైకోర్టు స్పష్టం చేసింది. రీవాల్యుయేషన్కు వీలు కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. రీవాల్యుయేషన్కు టీజీపీఎస్సీకి హైకోర్టు 8 నెలల డెడ్‌లైన్‌ విధించింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. పరీక్షకు మొత్తం 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10, 2025న గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను TGPSC విడుదల చేసింది.

అసలేం జరిగిందంటే..
గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయవద్దని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. 

గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టులో బలంగా వాదనలు వినిపించారు. పరీక్షలు పారదర్శకంగా జరగలేదని, మూల్యాంకనంలో లోపాలున్నాయన్నారు. అర్హత లేని వారు మూల్యాంకనం చేశారన్నారు. 21 వేల మంది పరీక్ష రాస్తే కేవలం సుమారు 5 వేల మందివి ఏ ప్రాతిపదికన రీవాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిపారని, అడుగడుగునా అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు.

కొన్ని సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులే ఎంపికయ్యారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పరీక్షలను రద్దు చేయాలని కోరారు. అయితే.. అభ్యర్థులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది తెలిపారు. మూల్యాంకనంలో సందేహాలున్న చోట రెండు, మూడు సార్లు మూల్యాంకనం జరిగిందన్నారు.