మిసెస్ ఇండియా రన్నరప్​గా ఖమ్మం మహిళ

మిసెస్ ఇండియా రన్నరప్​గా ఖమ్మం మహిళ

 

ఖమ్మం, వెలుగు: వీపీఆర్​ మిసెస్​ఇండియా సీజన్–2 పోటీల్లో ఫస్ట్​ రన్నరప్, మిసెస్​ఇండియా ఫొటోజెనిక్​గా ఖమ్మంకు చెందిన మహమ్మద్‍ ఫర్హా నిలిచింది. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన 912 మంది వివాహితలను ఆడిషన్ ​చేయగా 41 మంది ఫైనల్​కు సెలక్ట్​ అయ్యారు. వారిలో ఫర్హా ఒకరు. తెలంగాణ నుంచి ఈమె ఒక్కరే ఎంపిక కావడం విశేషం. ఆదివారం రాత్రి గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ఫైనల్స్​ జరగ్గా ఫర్హా ఫస్ట్​ రన్నరప్​గా, మిసెస్​ఇండియా ఫొటోజెనిక్​గా నిలిచింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తనకు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. మహిళల హక్కులు కాపాడేందుకు ఎప్పుడూ ముందుంటానని అన్నారు. ఈ ఈవెంట్​లో అసైన్‍మెంట్స్, టాలెంట్, ట్రెడిషనల్‍, ఫైనల్‍ రౌండ్లు ఉంటాయని వివరించారు. ఎంబీఏ వరకు చదివిన ఫర్హా హ్యూమన్‍ రైట్స్ అండ్‍ సోషల్‍ జస్టిస్‍ మిషన్‍, ఉమెన్‍ ఎంపవర్​మెంట్​వింగ్​కి ఖమ్మం సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టీఆర్ఎస్ పాలనలో దళితులకు ద్రోహం

పెద్దసార్లు దిగరు.. కొలువులు రావు

అక్కడ రోడ్లపై చెత్త వేస్తే రూ. 5 వేలు ఫైన్    

అప్పుడు పబ్‌‌.. ఇప్పుడు వైల్డ్‌‌లైఫ్‌‌ హాస్పిటల్‌