భూ తగాదాలో వదినను నరికి  చంపిన మరిది

భూ తగాదాలో వదినను నరికి  చంపిన మరిది

జహీరాబాద్, వెలుగు: భూ తగాదాలో సొంత వదినను మరిది నరికి చంపాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పస్తాపూర్ లో జరిగింది. జహీరాబాద్ సీఐ రాజశేఖర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షబానా బేగం(40), ఆమె మరుదులు యాకూబ్, ఖాజా మధ్య కొన్నాళ్లుగా భూ వివాదం నడుస్తోంది. ఆదివారం రాత్రి మరోసారి భూమి విషయంలో వదిన, మరుదుల మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో ఆవేశానికి లోనైన ఖాజా పక్కనే ఉన్న కొబ్బరి బోండాలు నరికే కత్తితో వదినపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన షబానా కుప్పకూలింది. స్థానికులు108లో హాస్పిటల్​కు తీసుకెళ్తుండగా దారిలో చనిపోయింది. నిందితులు పరారీలో ఉన్నారు.