బిగ్బాస్ లేటెస్ట్ ప్రోమో టాస్క్..మాయాస్త్రం కోసం కంటెస్టెంట్స్ యుద్ధం

బిగ్బాస్ లేటెస్ట్ ప్రోమో టాస్క్..మాయాస్త్రం కోసం కంటెస్టెంట్స్ యుద్ధం

బిగ్బాస్( Bigg Boss 7) సీజన్ 7లో నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఎంతో కృషియల్గా మొదలైన నామినేషన్ ప్రక్రియ..అప్పుడే ఫైనల్స్ స్టార్ట్ అయ్యిందా అన్నట్టు ఫీలింగ్ క్రియేట్ చేశారు. షోలో కంటెస్టెంట్స్ అందరూ ఒకరికి ఒకరు పోటీగా లీలబడుతూ.. ఒకరి తప్పును మరొకరు ఒప్పుకోకపోవడం, చాలా చిన్న విషయాల్లో మనస్పర్థలు తెచ్చుకోవడం వంటివి చేయడంతో..కొంత మంది ఆడియన్స్ కి మాత్రం ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు. 

ఇక లేటెస్ట్గా మరో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ఒకరికొకరు తమ శారీరక బలంతో తలపడుతూ..ఎలాగైనా పోటీలో గెలవాలి అనే నమ్మకంతో కంటెస్టెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 
ఇప్పటికే బిగ్బాస్ సీజన్ 7లో ఫస్ట్ పవర్ అస్త్రా సాధించిన కంటెస్టెంట్‌గా ఆట సందీప్ నిలిచాడు. ఇక ఇప్పుడు తరువాతి అస్త్రా కోసం కంటెస్టెంట్స్‌లో పోటీ షురూ అయ్యింది.ఇక వీరి తరువాతి అస్త్రం..మాయాస్త్రం అని, దానిని గెలుచుకోవాలంటే కంటెస్టెంట్స్ రెండు టీమ్స్‌గా విడిపోయి పోటీ పడాలని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు. డివైడ్ అయినా రెండు టీమ్స్‌కు రణధీర, మహాబలి అని పేర్లు కూడా పెట్టారు.

ఇక టీమ్స్ విషయానికి వస్తే..రణధీర టీమ్‌లో అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, శివాజీ, షకీలా ఉన్నారు. మహాబలి టీమ్‌లో టేస్టీ తేజ, దామిని, శుభశ్రీ, రతిక, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఇక పవర్ అస్త్రాన్ని సాధించిన ఆట సందీప్..సంచాలకుడిగా వ్యవహరించాడు. 

ఈ రెండు టీమ్స్‌లో ఎవరు గెలిస్తే వారికే మాయాస్త్రం కనిపిస్తుందని బిగ్ బాస్ ప్రోమోలో తెలిపారు. ఇక రణధీర టీమ్‌లో శివాజీ, షకీలా ఉన్నారని, ఎమోషనల్‌గా ఎవ్వరూ ఆలోచించవద్దని శుభశ్రీ ముందే తన టీమ్‌మేట్స్‌కు వివరించింది. ఇక ఆట మొదలవ్వక ముందే ఏదో ఒక విధంగా అవతల టీమ్‌ను ఏమర్చాలి అంటూ అమర్‌దీప్ ఒక ప్రణాళిక సిద్ధం చేయడం స్టార్ట్ చేశాడు.

ఈ రణధీర, మహాబలి టీమ్స్ ముందు ఫస్ట్ టాస్క్ రెడీగా ఉంది. దాని పేరే పుల్ రాజా పుల్. ఈ ఛాలెంజ్‌లో రెండు టీమ్స్ ఇరువైపులా నిలబడి మధ్యలో ఉన్న చెక్కను లాగి పట్టి గుంజాల్సి ఉంటుంది.అలా ఆ చెక్క ఎవరివైపు వెళుతుందో వారే విన్నర్స్ అవుతారు. ఈ ఛాలెంజ్‌లో రెండుసార్లు రణధీర టీమ్ గెలిచినట్టుగా ప్రోమోలో చూపించారు. ఇక ఎవరు గెలిచారనేది..క్లారీటిగా తెలియాలంటే బిగ్బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.