ఏపీ బీజేపీ ఆఫీసును ప్రారంభించిన కిషన్ రెడ్డి

ఏపీ బీజేపీ ఆఫీసును ప్రారంభించిన కిషన్ రెడ్డి

విజయవాడ: భారతీయ జనతా పార్టీ ఆంధ్ర్రప్రదేశ్ శాఖకు కొత్త కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  ప్రారంభించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఏపీ ఇంచార్జ్ సునీల్ థియోధర్ ఆధ్వర్యంలో జరిగిందీ కార్యక్రమం. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ లు, మాజీ ఎంపీ గంగరాజు,కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి, సత్య కుమార్, ఆదినారాయణ రెడ్డి, రావెల కిశోర్ బాబు, మధుకర్ జీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా నది తీరాన ఏపీ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అత్యధిక సభ్యతం కలిగి ఉన్న బీజేపీ పార్టీ.. ఎంపీలు.. ఎమ్మెల్యేలతోపాటు.. మహిళా నేతలు, అన్ని వర్గాల విభాగంలో అత్యధిక ప్రాతినిధ్యం ఉన్న ఏకైక పార్టీ బీజేపీయేనన్నారు. ఏపీ లోకూడా భవిష్యత్తులో బలపడుతుందని.. పార్టీ నాయకులందరూ కలసి మెలసి కుటుంబ సభ్యుల్లా పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని కిషన్ రెడ్డి కోరారు.