నితీశ్ కుమార్ ఎన్డీఏలో చేరుతారని  ముందే తెలుసు: ఖర్గే

నితీశ్ కుమార్ ఎన్డీఏలో చేరుతారని  ముందే తెలుసు: ఖర్గే

పాట్నా: నితీశ్ కుమార్ ఎన్డీఏలో చేరుతారని తమకు ముందే తెలుసు అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌‌ యాదవ్‌‌, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌‌ తో తాను మాట్లాడినప్పుడే ఈ విషయం చెప్పారన్నారు. ‘‘నితీశ్​లాంటి ‘ఆయా రామ్‌‌.. గయా రామ్‌‌’ మనుషులు దేశంలో చాలా మంది ఉంటారు. ‘ఇండియా’ కూటమి నుంచి కూడా బయటికి వెళ్తారని కూడా ముందే గ్రహించాం. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదు. బిహార్ ప్రజలను నితీశ్ మోసం చేస్తున్నాడు. అతన్ని రాష్ట్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు. లోక్​సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్తారు. ఇండియా కూటమి సమైక్యతను దృష్టిలో ఉంచుకొని తాము ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్లు చేయలేదన్నారు.