
భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఇంటివాడయ్యాడు. అదేంటి..కోహ్లీకి అల్రెడీ అనుష్క శర్మతో పెళ్లయింది. విరుష్క జంటకు ఓ పాప కూడా..! కోహ్లీ మరో ఇంటివాడవ్వడమేంటీ..? అనుకుంటున్నారా..మీరు చదివింది నిజమే. కోహ్లీ ఇంటివాడయ్యాడు. అయితే దీని అర్థం కోహ్లీ పెళ్లిచేసుకున్నాడని మాత్రం కాదు..కోహ్లీ ఓ లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశాడు. ముంబైలోని అలీబాగ్లో కోహ్లీ ఈ ఇంటిని కొన్నట్లు తెలుస్తోంది.
ధర ఎంతంటే..?
ముంబైలోని అలీ బాగ్లో ఆవాస్ విలేజ్లో లగ్జరీ బంగ్లా ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో కోహ్లీ ఓ ఇంటిని కోహ్లీ కొన్నాడు. 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని కోహ్లీ ఏకంగా రూ.6 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఎంతో అందంగా నిర్మించిన ఈ ఇళ్లకు సెలెబ్రిటీల్లో మంచి డిమాండ్ ఉందట. అందుకే ఈ ఇంటిని కోహ్లీ కొనుగోలు చేసినట్లు ప్రాజెక్టు నిర్వాహకులు వివరించారు.
రిజిస్ట్రేషన్ అయిందా..?
ఆవాస్ విలేజ్కు మాండ్వా జెట్టీ కేవలం ఐదు నిమిషాలే. స్పీడ్ బోట్లపై ముంబై వెళ్లడానికి కేవలం 15 నిమిషాలు పడుతుందట. ప్రస్తుతం ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ వల్ల కోహ్లీ బిజీగా ఉన్నాడు. దీంతో అతని సోదరుడు వికాస్ కోహ్లీ ఈ ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశాడు. మొదట ఇంటి కోసం స్టాంప్ డ్యూటీ కింద రూ.36 లక్షలు కోహ్లీ చెల్లించాడు. ఈ డీల్లో భాగంగా అతనికి 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే స్విమ్మింగ్ పూల్ కూడా లభిస్తుంది.