వికారాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు సహకరిస్తుందని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్, నాయకులు విజయరాజ్, రాములు, వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.