ఫేక్ కేసులు పెట్టి జైలుకు పంపారు

ఫేక్ కేసులు పెట్టి జైలుకు పంపారు

ఆదిలాబాద్ జిల్లా సెంట్రల్ జైలు నుంచి కోయపోషగూడ ఆదివాసీ మహిళలు బెయిల్ పై రిలీజ్ అయ్యారు. పోడుభూముల వ్యవహారంలో గత నెలలో 12మంది ఆదివాసీ మహిళలు జైలుకెళ్లారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు మహిళలకు బెయిల్ ఇప్పించగా... విడుదలైన సందర్భంగా ఆదివాసీనేతలు ఘనస్వాగతం పలికారు. మహిళలమని కూడా చూడకుండా ఫారెస్ట్ అధికారులు తమపై క్రూరంగా వ్యవహరించారని కన్నీరుపెట్టుకున్నారు  జైలు నుంచి విడుదలైన ఆదివాసీ మహిళలు. తమపై అమానుషంగా దాడి చేసి..ఫేక్ కేసులు పెట్టారని ఆరోపించారు. 2002 నుంచి తాము పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టాలిచ్చి ఆదుకోవాలని కోయపోషగూడ మహిళలు విజ్ఞప్తి చేశారు.