శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? -కేఆర్ఎంబీ
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో చెప్పాలని కృష్ణా బోర్డు టీఎస్ జెన్కోను కోరింది. కేఆర్ఎంబీ మెంబర్ (పవర్) ఎల్ బీ మౌన్తంగ్ సోమవారం జెన్కో (హైడల్) డైరెక్టర్కు లెటర్ రాశారు. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగి, పలువురు ప్రాణాలు కోల్పోవడం తమను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వెంటనే నివేదిక సమర్పించాలని కోరారు. జెన్కో ఇచ్చే నివేదికను కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం కోసం పంపాల్సి ఉంటుందని తెలిపారు.