కేటీఆర్ చేతుల మీదుగా సినారే స్మారక లైబ్రరీ ప్రారంభం

కేటీఆర్ చేతుల మీదుగా సినారే స్మారక లైబ్రరీ ప్రారంభం

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సిరిసిల్లలో నూతనంగా నిర్మించిన డా. సి.నారాయణ రెడ్డి స్మారక మందిరాన్ని, జిల్లా గ్రంధాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ రోజు సిరిసిల్లలో పర్యటిస్తున్న కేటీఆర్.. పర్యటనలో భాగంగా అంబేద్కర్ చౌరస్తాలోని రూ.3.55 కోట్లతో నిర్మించిన సినారే స్మారక లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంత కన్నా గొప్ప లైబ్రరీ లేదన్నారు. ఈ గ్రంథాలయాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కవులు, కళాకారులు ఈ లైబ్రరీని ఒక వేదికగా వాడుకోవాలని చెప్పారు.  లైబ్రరీని రాజకీయ కార్యకలాపాలకు వేదికగా వాడుకోవద్దన్నారు. గ్రంథాలయానికి సినారె పేరు పెట్టడం ఆయనకు నిజమైన  నివాళిగా పేర్కొన్నారు.  ఈ టెక్నాలజీ యుగంలో పుస్తకాల్ని బతికించడం కోసం చిరు ప్రయత్నంగా కేటీఆర్ అభివర్ణించారు.