
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనా కేసులు భారత్లో కూడా వెలుగులోకి వస్తుండటంతో బెంగళూరు ప్రభుత్వం అక్కడి మెట్రో రైళ్లు, బస్సులలో పలు రకాలుగా క్లీనింగ్ చర్యలు చేపట్టింది. బస్సులు, రైళ్లలోని అద్దాలు, డోర్లు, డోర్ హ్యాండిల్స్ లాంటివన్నీ శుభ్రం చేయాలని బెంగళూర్ బీఎంటీసీ అక్కడి అధికారులను ఆదేశించింది.
బెంగుళూర్లో ఎలాగైతే రైళ్లు, బస్సులను శుభ్రం చేస్తున్నారో అలాగే తెలంగాణలో కూడా శుభ్రం చేయాలని తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మెట్రో అధికారులను, ఆర్టీసీ అధికారులను కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు అధికారులతో పాటు, తెలంగాణ ఆర్టీసీ ఎండీ పువ్వాడ అజయ్ను కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. ‘కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా బెంగుళూరులో రవాణ కోసం ఉపయోగించే మెట్రో రైళ్లను, బస్సులను అక్కడి అధికారులు శుభ్రం చేయిస్తున్నారు. అలాగే మన దగ్గర కూడా వీలైనంత త్వరగా మెట్రో రైళ్లను, బస్సులను శుభ్రం చేయాలి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.