
2025, జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ ఇండియా మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మొదలు కానుంది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ టెస్ట్ సిరీస్లో స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారత్కు కీలక ఆటగాడిగా మారగలడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ అంచనా వేశాడు. 2025-26 ఆస్ట్రేలియన్ సమ్మర్ ఆఫ్ క్రికెట్ ప్రారంభోత్సవంలో హేడెన్ మాట్లాడుతూ.. భారత్, ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నాడు.
ఈ ఐదు టెస్టుల సిరీస్ భారత యువ జట్టుకు వారి వ్యక్తిత్వాన్ని పరీక్షించే కఠినమైన సిరీస్ అవుతోందన్నాడు. ఈ సిరీస్లో భారత్ అధిపత్యం చెలాయించాలంటే కుల్దీప్ భారత్ తరఫున 20 వికెట్లు పడగొట్టాల్సిన అవసరం హేడెన్ పేర్కొన్నాడు. నాథన్ లియాన్ రూపంలో ఆస్ట్రేలియా బలమైన స్పిన్నర్ను ఎలా కలిగి ఉందో.. ప్రతి జట్టు అలాగే నమ్మకమైన స్పిన్నర్ను కలిగి ఉండాలని పేర్కొన్నాడు. కాగా, ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.
హెడ్డింగ్లేలో తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి. మరీ యువ బ్యాటర్ శుభమన్ నేతృత్వంలోని యువ భారత్ జట్టు ఏమైనా అద్భుతాలు సృష్టించి సిరీస్ గెలుస్తుందా..? లేకపోతే జట్టులో సీనియర్లు లేకపోవడం, ఒత్తిడి తట్టుకోలేక చేతులు ఎత్తేస్తుందా..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇంగ్లాండ్ టూర్కు వెళ్లే భారత టెస్ట్ జట్టు:
శుభ్మన్ గిల్ (సి), రిషబ్ పంత్ (WK & VC), యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్
1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్