దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‎ల వేదికలు మార్పు.. కొత్త వేదికలు ప్రకటించిన బీసీసీఐ

దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‎ల వేదికలు మార్పు.. కొత్త వేదికలు ప్రకటించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: ఈ ఏడాది (2025) చివర్లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లు ఇండియాలో పర్యటించనున్నాయి. టీమిండియాతో టెస్ట్, వన్డే, టీ20 మ్యాచులు ఆడనున్నాయి. మొదటగా 2025 అక్టోబర్‎లో కరేబియన్ జట్టు రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం భారత్‎కు రానుంది. ఈ సిరీస్ అక్టోబర్ 2 నుంచి గుజరాత్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ప్రారంభమవుతుంది. రెండవ టెస్ట్ కోల్‎కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే, రెండవ టెస్ట్‌ను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ నుంచి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి మార్చింది బీసీసీఐ. 

అక్టోబర్ 10 నుండి 14 మధ్య ఈ రెండో టెస్ట్ ఢిల్లీ వేదికగా జరగనుంది. దీనితో పాటుగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరగనున్న రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ వేదికలను కూడా మార్చింది బీసీసీఐ. బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ నవంబర్ 14 నుంచి ఢిల్లీలో జరగాల్సి ఉంది. కానీ ఈ మ్యాచ్ వేదికను బీసీసీఐ మార్చింది. ఢిల్లీ నుంచి కోల్‎కతాకు తరలించింది. ప్రోటీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వేదికల్లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు బీసీసీఐ.

ALSO READ | హాకీ అమ్మాయిల శుభారంభం.. బెల్జియంపై ఉత్కంఠ విజయం

 ఇండియా A, దక్షిణాఫ్రికా A మధ్య జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌ల వేదికలను కూడా బీసీసీఐ ఛేంజ్ చేసింది. ఈ మ్యాచ్‌లను బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం నుంచి రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి తరలించింది. వేదికలలో మార్పులకు సంబంధించిన కారణాన్ని బీసీసీఐ స్పష్టం వెల్లడించనప్పటికీ.. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శీతాకాలంలో ఢిల్లీలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది.  ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14 నుండి ఢిల్లీలో జరగాల్సి ఉంది. ఈ సమయంలో వింటర్ సీజన్ పీక్స్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భారత్, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టెస్ట్‎ను ఢిల్లీ నుంచి కోల్ కతాకు మార్చినట్లు తెలుస్తోంది. 

బీసీసీఐ మార్పులు చేసిన షెడ్యూల్:

ఇండియా vs వెస్టిండీస్ టెస్ట్ సిరీస్

మొదటి టెస్ట్ - అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 6 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో

రెండవ టెస్ట్ - అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 14 వరకు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో

భారత్ vs దక్షిణాఫ్రికా

మొదటి టెస్ట్ - నవంబర్ 14 నుండి నవంబర్ 18 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్

2వ టెస్టు - నవంబర్ 22 నుంచి నవంబర్ 26 వరకు గౌహతిలో

మొదటి వన్డే - నవంబర్ 30 - రాంచీ