
ఆంట్వెర్ప్ (బెల్జియం): ఇండియా జూనియర్ విమెన్స్ హాకీ టీమ్ యూరప్ టూర్ను విజయంతో షురూ చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 3-–2 తో ఆతిథ్య బెల్జియంపై ఉత్కంఠ విజయం సాధించింది. ఇండియా తరఫున గీతా యాదవ్ 11వ నిమిషం తొలి గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది.
రెండో క్వార్టర్లో బెల్జియం అమ్మాయి మేరీ గోన్స్ 25వ నిమిషంతో గోల్ కొట్టి స్కోరు సమం చేసింది. ఆ వెంటనే లూయిస్ వాన్ హెకె (34వ ని) మరో గోల్ కొట్టడంతో బెల్జియం 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో ఇండియా ప్లేయర్లు పట్టుదలగా పోరాడారు. ఫలితంగా సోనమ్ 40వ నిమిషంలో గోల్ చేసి స్కోరు చేసింది.
ఆ తర్వాత కూడా మన అమ్మాయిలు ఎదురుదాడులు కొనసాగించారు. ఈ క్రమంలో మరో ఐదు నిమిషాల్లోనే పెనాల్టీ కార్నర్ లభించింది. 45వ నిమిషంలో లాల్తాంట్లుయాంగి దీన్ని గోల్గా మలిచి జట్టుకు విజయాన్ని అందించింది. మంగళవారం జరిగే తమ తర్వాతి మ్యాచ్లో మరోసారి బెల్జియంతో ఇండియా తలపడనుంది.