దిశ నిందితలను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. హైదరాబాద్లో డాక్టర్ను చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏంలేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు.
నిందితుల ఎన్కౌంటర్పై సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఘాటుగా స్పందించారు. ఎవరైనా తన కుమార్తెల జోలికి వస్తే, తాను కూడా ఇలాగే ఎన్కౌంటర్ చేస్తానని ఆమె హెచ్చరించారు. ఎన్కౌంటర్ గురించి ఓ చానల్ ఖుష్బూని అడగగా ఆమె పైవిధంగా స్పందించారు.
For More News..